Maha Shivaratri: పెన్సిల్ మొనపై మహాశివుడి సూక్ష్మ విగ్రహం

2025 ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని (Maha Shivaratri) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను ఆరాధించి ఆశీర్వాదం పొందుతారు. చాలా మంది భక్తులు ఈ పర్వాన అభిషేక ప్రియుడైన మహాశివుడికి జల,పాల,మధు,పుష్పాలతో అభిషేకాలు చేస్తుంటారు.

ఈ సందర్భంగా మాహశివరాత్రి సందర్భంగా పరమ శివుడి అద్భుతమై సూక్ష్మ విగ్రహాన్ని చెక్కి అందరినీ ఆశ్యర్యపరిచాడు వైజాగ్‌కు చెందిన గట్టెం వెంకటేష్.
సూక్ష్య కళాకారుడు అంటే మినియేచర్ ఆర్టిస్ట్ అయిన గట్టెం వెంకటేష్ పెన్నిల్ మొనపై విభిన్నమైన కళాకృతులను చెక్కి ఆశ్చర్యపరుస్తుంటాడు.
పెన్నిల్ మొనపై మాత్రమే కాదు చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బుబిల్ల, పంటిపుల్ల, అగ్గిపుల్ల వంటి వస్తువులపై కూడా కూడా పేర్లను, బొమ్మలను చెక్కాడు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా 10 గంటలు కష్టపడి 18 మిల్లీ మీటర్ల ఎత్తు, 8 మిమీ వెడల్పు ఉన్న మహా శివుడి విగ్రహాన్ని చెక్కాడు.
దీని కోసం గట్టెం వెంకటేష్ చార్కోల్ పెన్సిల్‌ను వినియోగించాడు.

గతంలో ఇలాంటి ఎన్నో కళాకృతులను పెన్సిల్ మొనపై చెక్కాడు గట్టెం వెంకటేష్.తన ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న గట్టెం వెంకటేష్‌‌కు జాతీయ అవార్డు కూడా లభించింది.దీంతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు ఈ మోస్ట్ ట్యాలెంటెడ్ మినియేచర్ ఆర్టిస్ట్.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Comment